Home / TELANGANA / బయో ఆసియా-2020 సదస్సును విజయవంతంగా నిర్వహిస్తాం.. కేటీఆర్

బయో ఆసియా-2020 సదస్సును విజయవంతంగా నిర్వహిస్తాం.. కేటీఆర్

2020 ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు తెలంగాణలో ‘బయో ఆసియా-2020’ సదస్సు జరుగనున్నది. హైద్రాబద్‌లోని హెచ్‌ఐసీసీ వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుంది. రేపటి కోసం నేడు అనే థీమ్‌తో ఈ సదస్సు జరుగనుంది. ఈ రోజు దీనికి సంబంధించిన వెబ్‌సైట్‌, లోగో, థీమ్‌ను ఐటీ, పురపాలక శాఖామంత్రి కేటీఆర్‌ విడుదల చేశారు. ఇది 17వ బయోఆసియా సదస్సు కావడం విశేషం. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. గతంలో చాలా అంతర్జాతీయ కార్యక్రమాలకు హైదరాబాద్‌ వేదికైన విషయం తెలిసింది. హైదరాబాద్‌ అంతర్జాతీయ సదస్సులకు వేదికవడం సంతోషదాయకమని అన్నారు. అలాగే ఈ ‘బయో ఆసియా-2020’ సదస్సును విజయవంతంగా నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్‌, టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, బయో ఆసియా సీఈవో శక్తినాగప్పన్‌, తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat