ఈ రోజు జరిగిన హుజూర్నగర్ ఉప ఎన్నిక ఫలితాలపై యావత్ తెలంగాణ ప్రజానీకం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగి..ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 5 గంటలవరకు 84.96 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
కాగా ఈ ఎన్నికల్లో మొత్తం 28 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి, టీఆర్ఎస్ అభ్యర్థి సైది రెడ్డి మధ్యే గట్టి పోటీ ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాకుండా పోలింగ్ అనంతరం విడుదైన ఎగ్జిట్ పోల్స్ కూడా టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నాయి. హుజూర్నగర్లో టీఆర్ఎస్దే విజయమని ఆరా సర్వే సంస్థ ప్రకటించింది. టీఆర్ఎస్కు 50.48 శాతం, కాంగ్రెస్కు 39.95శాతం, ఇతరులకు 9.57శాతం విజయవకాశాలు ఉన్నాయని ఆ సంస్థ పేర్కొంది. హుజూర్నగర్లోని అన్ని మండలాల్లో టీఆర్ఎస్కే ఆధిక్యమని తమ సర్వేలో తేలినట్టు ఆరా తెలిపింది.