నిరుపేదలకు నిలువెత్తు గౌరవం డబుల్ బెడ్ రూం ఇండ్లు అని రాష్ట్ర ఆర్ధికశాఖమంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం బద్ధిపడగ తండాలో డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించారు మంత్రి హరీష్ రావు. ఈసందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇండ్లు లేని నిరుపేదలకు ఆత్మ గౌరవంతో బతకాలని డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నారు. దేశంలో మరెక్కడా ఇలాంటి ఇండ్లు నిర్మించి ఇవ్వడం లేదని., నిరు పేద ప్రజలకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా సకల వసతులతో ఇండ్లు నిర్మించి ఇస్తున్నాం. ఇన్నాళ్లు పూరి గుడిసెల్లో నివసించిన బద్ధిపడగ తండా లంబాడీలు ఇప్పుడు ఆత్మ గౌరవంతో జీవిస్తారు. అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా ఇండ్లు నిర్మించి ఇస్తామని, మిగిలి పోయిన పేదవారికి కూడా మరిన్ని ఇండ్లు నిర్మించి ఇస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.
పేద ప్రజల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. వ్యవసాయాన్ని లాభదాయం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నది.. పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నాం.. పేదలకు ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ పెన్షన్లు పెంచారు. గ్రామాల్లో యువత పెడదారిన పడొద్దు. సోషల్ మీడియా మోజులో పడి జీవితాల్ని నాశనం చేసుకోకండి. సమయాన్ని వృథా చేస్తూ తిరగడం మంచిది కాదని..కష్ట పడి పని చేయడానికి ముందుకు వచ్చే వారికి అనేక అవకాశాలు ఉన్నాయంటూ.. పని చేయడానికి ముందుకు వచ్చే యువకులకు శిక్షణ ఇప్పించి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.