తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఎన్నికల సమయంలో కానీ.. ఆ తర్వాత కానీ ఎలాంటి హామీ ఇవ్వలేదని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఏపీలోని తిరుమల తిరుపతిలో వేంకటేశ్వర స్వామిని ఆమె దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ” దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని వరాలను తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చాము. జీతాలను ఎక్కువగా పెంచిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఆర్టీసీ నష్టాల్లో ఉన్న కానీ నలబై ఏడు శాతం జీతాలను పెంచాము. ఇప్పటికైన మొండివైఖరీ మార్చుకుని ఉద్యోగాల్లో చేరాలి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఎక్కడ. ఎప్పుడు చెప్పలేదు “అని ఆమె తెలిపారు.
