పేదల కోసం డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. రాష్ట్రంలో ఇండ్లులేని పేదలు ఉండొద్దన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇండ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ నంబర్వన్గా నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. స్టేషన్ఘన్పూర్ మండలం రాఘవపూర్లో మంత్రి ప్రశాంత్ రెడ్డితో కలిసి ఎర్రబెల్లి డబుల్బెడ్రూం ఇండ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు మంత్రులు ఇండ్ల పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జెడ్పీఛైర్మన్ సంపత్ రెడ్డి పాల్గొన్నారు.