కాకతీయుల కాలం నాటి పేరిణి నృత్యకళకు జాతీయ స్థాయిలో గుర్తింపు తేవాలని, ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగించాలని రాష్ట్ర క్రీడీ, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ కేంద్ర సంగీత, నాటక అకాడమీ సభ్యులు, సీసీఆర్టి స్పషల్ ఆఫీసర్ డా. తాడేపల్లిని కోరారు. ఆదివారం మంత్రి శ్రీనివాస్గౌడ్తో తాడేపల్లి భేటీ అయ్యారు. డిసెంబరు 22న హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో జరిగే ప్రముఖ యక్షగాన కళాకారులు, సినీ దర్శకులు వేదాంతం రాఘవయ్య శతజయంతి కార్యక్రమంలో మంత్రిని ఆహ్వానించడానికి వచ్చినట్టుతెలిపారు.
ఈసందర్భంగా మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రాచీనకళలు ఉన్నాయని, వాటిని కేంద్ర సాసంసాంస్కృతిక శాఖ ద్వారా జాతీయస్థాయిలో ప్రోత్సాహం అందించాలని కోరారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో కళలకు, కళాకారులకు ప్రోత్సహం లభిస్తోందన్నారు. కళాకారులకు పెన్షన్లు, గుర్తింపు కార్డులను అందించామని అన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ, కేంద్ర సంగీత నాటక అకాడమీ, సీసీఆర్టిల ద్వారా రాష్ర్టానికి చెందిన కళాకారులకు స్కాలర్షిప్లను. పెన్షన్లను,రీసెర్చ్ స్కాలర్లకు తగిన ప్రోత్సాహం, అవకాశాలు అందించాలన్నారు.