తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని బోడుప్పల్ లో జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ..”తెలంగాణ తెచ్చిన పార్టీ టీఆర్ఎస్. ఆరేళ్లుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన … నడిపిస్తున్న పార్టీ టీఆర్ఎస్. అందుకే అభివృద్ధి చేసే పార్టీకి పట్టం కట్టండి. ఒకప్పుడు కరెంటు ఉంటే వార్త. కానీ ఇప్పుడు కరెంటు పోతే వార్త. పవర్ హాల్ డేస్ లేవు. పరిశ్రమలకు నిరంతర కరెంటు ఇస్తున్నాము. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది. ప్రజలందరూ ఆలోచించి టీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేసి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికల ఇంఛార్జీలు బండి రమేష్, ఆనంద్, ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
