కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎంపీ, మహిళా విభాగం అధ్యక్షురాలు సుస్మితా దేవ్ రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖను పంపారు. ఆమె రాజీనామాతో పార్టీకి ఎదురుదెబ్బ అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
సుస్మితా దేవ్ 2014 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్పై అసోంలోని సిల్చార్ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. తర్వాత ఆమెకు పార్టీ అధిష్ఠానం ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ బాధ్యతలు సైతం అప్పగించింది.
అసోం శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత సుస్మితా దేవ్ రాజీనామా చేస్తుండడంతో కాంగ్రెస్కు మరింత ఇబ్బందికరంగా మారింది. రాజీనామాకు ముందు ఆమె వాట్సాప్ గ్రూప్ల నుంచి వైదొలిగారు. ఇటీవల ట్విట్టర్ కాంగ్రెస్ నేతలకు చెందిన అకౌంట్లు లాక్ చేయగా.. ఇందులో సుస్మితాదేబ్ అకౌంట్ కూడా ఉన్నది. ఇదిలా ఉండగా.. ఆమె తృణమూల్ కాంగ్రెస్లో చేరనున్నట్లు తెలుస్తోంది.