కేరళలో కరోనా కేసులు ఇప్పటికీ భారీగా వస్తుండటంతో ఆ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టీకాలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తూ.. ప్రభుత్వానికి సహకరించని వారికి ఉచిత వైద్యం అందించమని స్పష్టం చేశారు.
వ్యాక్సిన్ తీసుకోనివారు కొవిడ్ బారినపడితే వైద్య ఖర్చులు ప్రభుత్వం భరించబోదని వెల్లడించారు. అనారోగ్యంతో వ్యాక్సిన్ వేసుకోనివారు ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలని స్పష్టం చేశారు.