దేశంలో కొత్తగా 7992 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,46,82,736కు చేరింది. ఇందులో 3,41,14,331 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 4,75,128 మంది మృతిచెందారు.
మరో 93,277 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గత 559 రోజుల్లో యాక్టివ్ కేసులు ఇంత తక్కువకు చేరుకోవడం ఇదే మొదటిసారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
కాగా, గత 24 గంటల్లో మహమ్మారి వల్ల మరో 398 మంది బాధితులు మరణించారని, 9265 మంది కరోనా నుంచి బయటపడ్డారని తెలిపింది. ఇప్పటివరకు 131.99 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది.