బీహార్ లో బీజేపీకి ప్రస్తుత తాజా సీఎం , జేడీయూ నేత నితీశ్కుమార్ ఎన్డీయే కూటమి గుడ్బై చెప్పడంతో బిహార్ రాష్ట్రంలో తాజా రాజకీయాలు వేడెక్కాయి. ప్రస్తుతం ఇరుపార్టీల నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ క్రమంలో మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ పాత ట్వీట్ను రీట్వీట్ చేస్తూ నితీశ్కుమార్పై బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘లాలూ జీ మీ ఇంట్లోకి పాము ప్రవేశించింది’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
2017లో నితీశ్కుమార్ ఆర్జేడీతో విడిపోయిన సమయంలో లాలూ ఓ ట్వీట్లో నితీశ్ ఓ పాము అనీ, పాము కుబుసాన్ని వదిలి కొత్త చర్మాన్ని తొడుగినట్లు.. నితీశ్ కూడా ప్రతి రెండేళ్లకోసారి కూటమిని మారుస్తారని, ఇందులో ఎవరికైనా అనుమానం ఉందా? అంటూ ట్వీట్ చేశారు. నిషేధ చట్టానికి సంబంధించి గిరిరాజ్ సింగ్ మరో ట్వీట్లో జేడీయూ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.
బిహార్లో మద్యపాన నిషేధం తర్వాత బిహార్ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం అంతా లిక్కర్ మాఫీయాకే వెళ్తుందని, జేడీయూ తన పార్టీని బతికించుకునేందుకు ఉపయోగిస్తోందన్నారు. ఈ రోజు నిషేధచట్టం తొలగిపోతుదని, రేపు జేడీయూ ముగుస్తుందన్నారు. నిషేధం తర్వాత, JDU విరాళాల సేకరణలో అపూర్వమైన పెరుగుదల ఉందని ఆరోపించారు. నితీశ్ అందరి వాడు కాదని, కేవలం కుర్చీకే చెందినవాడని విమర్శించారు.