Home / HYDERBAAD / బీజేపీ పార్టీ పాలిత రాష్ట్రాలలో అతి తక్కువ పెన్షన్లు

బీజేపీ పార్టీ పాలిత రాష్ట్రాలలో అతి తక్కువ పెన్షన్లు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని కొండాపూర్ డివిజన్ పరిధిలోని కొత్తగూడ విలేజ్ లోని కమ్యూనిటీ హాలు నందు, నూతనంగా మంజూరు అయినటువంటి తెలంగాణ ప్రభుత్వ ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు కార్డులను గౌరవ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీ అరికెపూడి గాంధీ గారు, గౌరవ కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ హమీద్ పటేల్ గారితో కలసి లబ్ధిదారులకు పంపిణీ చేయుట జరిగింది.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ గారు మాట్లాడుతూ  బీజేపీ పార్టీ పాలిత రాష్ట్రాలలో అతి తక్కువ పెన్షన్లను ఇస్తున్నారని, మిగతా ఏ రాష్ట్రాలలోనూ లేని విధంగా పెన్షన్లను మన తెలంగాణ రాష్ట్రంలో పెంచి, పేద వారిని అన్ని విధాలుగా ఆదుకుంటున్న ప్రభుత్వం మన తెరాస ప్రభుత్వమని అన్నారు. మన తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధులు కేంద్రం ఇవ్వకపోయినా, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో ఎన్నో అభివృద్ధి పనులను చేస్తోందని అన్నారు. కేసీఆర్ గారు ఆదేశాలు మేరకు రాష్ట్రంలో మరిన్ని పెన్షన్లను పెంచి, లబ్ధిదారులకు అందజేయటం జరుగుతున్నదని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గాంధీ గారితో బాటుగా కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ గారు, మాజీ కార్పొరేటర్ నీలం రవీందర్ ముదిరాజ్ గారు, జీహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ వెంకన్న గారు, ప్రాజెక్ట్ ఆఫీసర్ మాన్వి గారు, కొండాపూర్ డివిజన్ తెరాస పార్టీ ప్రెసిడెంట్ అబ్బుల కృష్ణ గౌడ్, జనరల్ సెక్రటరీ పేరుక రమేష్ పటేల్, సెక్రటరీ జె. బలరాం యాదవ్, తెరాస సీనియర్ నాయకులు అన్నం శశిధర్ రెడ్డి, ఊట్ల కృష్ణ, రక్తపు జంగంగౌడ్, కె. నిర్మల, రూప రెడ్డి, శ్రీనివాస్ చౌదరి, తిరుపతి యాదవ్, గణపతి, హిమామ్, రజనీకాంత్, సంజీవ, లక్ష్మి నారాయణ, స్వామి సాగర్, నీలం లక్ష్మణ్, ఎండి ఖాసీం, షేక్ రఫీ, తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat