తెలంగాణలో పోలీస్ సర్కారు కొలువుల కోసం ఎదురుచూస్తూ ఫిజికల్ టెస్ట్కు సన్నద్ధమవుతున్న పోలీస్ ఉద్యోగార్థులకు మంత్రి హరీశ్ రావు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఉద్యోగ సాధనలో కీలకమైన దేహ దారుఢ్య పరీక్షకు ప్రతిఒక్కరు తపనతో ప్రాక్టీస్ చేయాలని సూచించారు.
సిద్దిపేటలోని మల్టీపర్పస్ హైస్కూల్లో పోలీసు కానిస్టేబుల్, ఎస్ఐ అభ్యర్థులకు జరుగుతున్న ఉచిత శారీరక దృఢత్వ శిక్షణ కేంద్రాన్ని మంత్రి హరీశ్ రావు ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాలు, ఉడకబెట్టిన కోడిగుడ్లు పంపిణీ జరుగుతున్న తీరు, పీఈటీలు ఇస్తున్న శిక్షణ గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మాట్లాడుతూ.. పోలీసు ఉద్యోగం సాధించాలనుకునేవారు కేసీఆర్ ఉచిత శిక్షణ ద్వారా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. నిష్ణాతులైన పీఈటీలతో అభ్యర్థులకు క్రమం తప్పకుండా సరైన శిక్షణ ఇప్పించాలని నిర్వాహకులను ఆదేశించారు. కాగా, అనుకున్నదానికంటే ఎక్కువగా అభ్యర్థులు వచ్చారని నిర్వాహకులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అయితే అందరికీ మంచి పౌష్టికాహారాన్ని, శిక్షణను అందింలాన్నారు.