లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ రాష్ట్ర డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను నిన్న ఆదివారం అరెస్ట్ చేయడంపై సీబీఐ స్పందించింది. ఉప ముఖ్యమంత్రి అయిన మనీష్ సిసోడియా విచారణకు సహకరించలేదు..
తాము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పకుండా దాటవేసే ప్రయత్నం చేశారని తెలిపింది. తాము సేకరించిన ఆధారాలపై ప్రశ్నించాము.. అయితే వాటికి సరైన సమాధానం చెప్పని నేపథ్యంలో సిసోడియాను అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. కాగా, నేడు ప్రత్యేక కోర్టులో సిసోడియాను సీబీఐ హాజరుపర్చనుంది.