ప్రధాని మోడి నిలువెల్లా అవినీతిలో కూరుకపోయారని ఢిల్లి సీఎం కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేసారు. బీజేపీ ముఖ్యమంత్రులు అవినీతికి పాల్పడిన సొమ్మును కింది నుంచి పైకి పంపిస్తే..ఆప్త మిత్రుడి (అదానీ?) కంపెనీలో పెట్టుబడులు పెట్టారని ఆరోపించారు. లిక్కర్ కేసులో వంద కోట్ల అవినీతి అంటున్న బీజేపీ పెద్దలు సాక్షాలెందుకు చూపడం లేదని ప్రశ్నించారు.
సీబీఐ నోటిసుల నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు.లిక్కర్ కేసులో అరెస్టు చేసిన నిందితులు తప్పుడు సాక్షం చెప్పేలా వారిని ఈడీ తీ్వ్రంగా హింసిస్తుందన్నారు. ఈడీ కస్టడిలో ఉన్న చందన్ రెడ్డి మేడికల్ రిపోర్టులను చూయించారు కేజ్రీవాల్.
ఈడీ దెబ్బలకు చందన్ రెడ్డి రెండు చెవులు పనిచేయడం లేదన్నారు. మరో నిందితుడి సతీమణి, కూతుల్లను సైతం బెదిరిస్తున్నారని ఆరోపించారు . తాము చెప్పినట్లు వినకపోతే..నీ కూతుల్లు కాలేజీకి ఏలా వెళ్తారో చూస్తామని చెదిరింపులకు దిగటం ఏంటని ప్రశ్నించారు. 15 నిమిషాల ప్రెస్ మీట్ లో కేంద్ర ప్రభుత్వ తీరును తీవ్ర స్థాయిలో ఎండగట్టారు కేజ్రీవాల్