ఇచ్చొడ మండలంలోని ధాభ – కే గ్రామ పంచాయతీ పరిధిలో గల భాధిగూడ గ్రామంలో నూతనంగా నిర్మించిన పోచమ్మ దేవాలయ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా గౌరవ బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు గారు హాజరయి ఆలయాన్ని ప్రారంభించారు. గ్రామస్తులు మాట్లాడుతూ ఎంతో మంది నాయకులం చూసాం కానీ మా ఈయోక్క చిన్న గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోయేదని ఈరోజు గౌరవ బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు గారి కృషితో గిరిజన గ్రామమైన ఆదివాసీ గూడకి రోడ్డు వేసి ఆలయాలు కట్టించిన ఘనత గౌరవ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గారికే దక్కుతుందన్నారు.
ఓ ఆదివాసీ నాయకుడు మాట్లాడుతూ రాథోడ్ బాపురావు గారిని వదులుకుంటే అభివృద్ధిని వదులుకున్నట్టే అని అన్నారు. గౌరవ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గారు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు మోసపోయారని నేడు స్వరాష్ట్రంలో ఆలయాలు కానీ ఇంకా ఇతరత్రా పనులలో అభివృద్ధి అద్భుతంగా జరుగుతుంది..
అదేవిధంగా మావ నాటే మావ రాజ్ నినాదాన్ని నిజం చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గారితో పాటు గ్రామస్తులు మండల నాయకులు పాల్గొన్నారు.