Breaking News
Home / SLIDER / ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 76వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన

‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 76వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, రంగారెడ్డి నగర్ 127 డివిజన్ పరిధిలో “ప్రగతి యాత్ర”లో భాగంగా 76వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. స్థానిక కార్పొరేటర్ బి.విజయ్ శేఖర్ గౌడ్ గారితో కలిసి ఇందిరా గాంధీనగర్, సౌభాగ్య నగర్, ఆదర్శ్ నగర్ లలో పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన రోడ్లు తదితర అభివృద్ధి పనులు పరిశీలించారు.

కాగా అక్కడక్కడా మిగిలి ఉన్న భూగర్భడ్రైనేజీ లైన్లు, సీసీ రోడ్లు పూర్తి చేయాలని, కమిటీ హాళ్ల ఏర్పాటుకు కృషి చేయాలని ఎమ్మెల్యే గారిని స్థానిక ప్రజలు కోరారు. దీంతో అక్కడే ఉన్న అధికారులకు ఎమ్మెల్యే గారు ఆదేశాలిచ్చారు.

ప్రజలకు అసౌకర్యం లేకుండా వాటిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జయరాం, స్థానిక డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఏర్వ శంకరయ్య, మాజీ అధ్యక్షుడు గౌసుద్దిన్, వార్డు సభ్యులు రహీం, లక్ష్మణ్, మాజీ వార్డు మెంబర్ కవిత, కాలనీ వాసులు ఆంజనేయులు గౌడ్, శంకర్ గౌడ్, మడికే విజయ్, నర్సింగ్, నాయకులు ఓంకార్ రెడ్డి, కార్తిక్ గౌడ్, క్రాంతి యాదవ్, శ్రీను, సతీష్ గట్టోజి, మహబూబ్, బాలునేత, అల్లావుద్దీన్, గౌస్, కిరణ్ యాదవ్, ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino