ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు బీజేపీ తెలంగాన రాష్ట్ర నాయకత్వంపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ .. మంత్రి కేటీఆర్ కేటీఆర్ నిప్పులు చెరిగారు.తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్వీ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. మోదీ, బోడీకి బెదిరిలేదు.. ఏం చేసుకుంటారో.. చేసుకోండి అని మంత్రి కేటీఆర్ తేల్చిచెప్పారు.
గట్టిగా మాట్లాడిన వారిపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు చేయిస్తరు. మోదీ, బోడీ, నీ ఈడీ మా వెంట్రుక కూడా పీకలేరు. ఏం చేసుకుంటవో చేసుకోపో. చావనైనా చస్తాం.. నీకు మాత్రం లొంగిపోయే ప్రసక్తే లేదు. తప్పు చేయనోళ్లు ఎవరికీ భయపడరు.
ఆరోపణలు మోదీ మీద వచ్చాయి. శ్రీలంక దేశంలో అక్కడి ప్రభుత్వ పెద్దలు, విద్యుత్ రంగ సంస్థ అధిపతి.. మోదీ మీద ఆరోపణలు చేశారు. రూ. 6 వేల కోట్ల కాంట్రాక్ట్ గౌతం అదానీకి ఇవ్వాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. నీకు నీతి, సిగ్గు, మానం ఉంటే దాని మీద వివరణ ఇవ్వండి. అది వాస్తవమా? కాదా? చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దీనిపై ప్రజలకు సంజాయిషీ ఇవ్వాలన్నారు.