కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్, గౌరవ మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారు, కమీషనర్ రామకృష్ణా రావు గారు 12వ డివిజన్ ఇందిరమ్మ కాలనీ ఫేస్-2 లో నూతనంగా నిర్మించుకున్న బస్తీ దవాఖాన ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా మేయర్ గారు మాట్లాడుతూ కాలనీలలో,బస్తీలలో ప్రజల కోసం మెరగైన వైద్య సదపాయాలు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం బస్తీ దవాఖానను ఏర్పాటు చేసి నిపుణులైన వైద్యులతో వైద్య సేవలు అందిస్తుంది .
కావున అందరు వైద్య సేవలను ఉపయోగించుకోవాలని తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ ఆగం పాండు ముదిరాజ్ గారు, గౌరవ కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు,DMHO నిర్మల గారు,NMC బీఆర్ఎస్ అధ్యక్షులు మరియు అనుబంధ కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు, యువ నాయకులు NMC ఉన్నత అధికారులు,మెడికల్ ఆఫీసర్స్, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.