భద్రాద్రి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల పోస్టర్ ను హైదరాబాద్ లోని సచివాలయంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు ఆవిష్కరించారు. ఈ నెల 19 నుంచి వచ్చే నెల 8 వరకు భద్రాద్రి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని మంత్రులు తెలిపారు. ఈ నెల 28న గోదావరిలో తెప్పోత్సవం, 29 ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చే స్వామి వారిని కనులారా తిలకించేందుకు తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారని చెప్పారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తుందని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే మదన్ లాల్, ఖమ్మం డిసిసిబి చైర్మన్ మువ్వ విజయ బాబు, భద్రాద్రి ఆలయం ఈవో కె.ప్రభాకర శ్రీనివాస్ పాల్గొన్నారు.
