Home / TELANGANA / పాల్వంచ‌లో ఐర‌న్ ఓర్ స్టీల్ ప్లాంట్ …కేంద్రమంత్రి బీరేంద్రసింగ్

పాల్వంచ‌లో ఐర‌న్ ఓర్ స్టీల్ ప్లాంట్ …కేంద్రమంత్రి బీరేంద్రసింగ్

విభజన చట్టంలో ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామ‌ని కేంద్ర ఉక్కుశాఖ‌ మంత్రి  బీరేంద్రసింగ్ తెలిపారు. హైద‌రాబాద్‌లో శ‌నివారం నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ….ఖమ్మం జిల్లా పాల్వంచలో  1.5 మిలియన్ సామర్థ్యం గల స్క్రాప్ బేస్డ్ ఐరన్ ఓర్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తామ‌న్నారు. తెలుగురాష్ట్రాలకు స్టీల్ ప్లాంట్స్ ఇస్తామని విభజన చట్టంలో అప్పటి ప్రభుత్వం పేర్కొందని ఆయ‌న తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో ..  తెలంగాణలోని బయ్యారంలో స్టీల్ ప్లాంట్స్ ఏర్పాటుకు స్థలం కూడా ఉందని కేంద్ర మంత్రి వెల్ల‌డించారు.

గతంలో వచ్చిన నివేదికలు ఏర్పాటు సాధ్యం కాదు అని తేల్చాయని ఈ నేప‌థ్యంలో స్టీల్ ప్లాంట్స్ ఏర్పాటుపై కేంద్రం జరిగిన సమావేశంలో కేంద్రమంత్రి సుజనా చౌదరీ, మంత్రి కేటీఆర్ కూడా పాల్గొన్నారని కేంద్ర మంత్రి వెల్ల‌డించారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై నెల రోజుల్లో ఫీజిబులిటీ నివేదిక వస్తోందని ఆశిస్తున్నామ‌ని…..వచ్చిన తరువాత నిర్ణయం తీసుకుంటామ‌న్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామ‌న్నారు.

ఖమ్మం జిల్లా పాల్వంచలో  1.5 మిలియన్ సామర్థ్యం గల స్క్రాప్ బేస్డ్ ఐరన్ ఓర్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తామ‌ని కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్ వెల్ల‌డించారు. బయ్యారం ఐరన్ ఓర్ ప్లాంట్ ఏర్పాటుపై ఎన్ఎండీసీ స్టడీ చేస్తోందని ఆయ‌న తెలిపారు. ఎన్ఎండీసీ 60వ వార్షికోత్సవం జరుపుకోవటం స్టీల్ పరిశ్రమకు గొప్ప విషయమ‌ని మంత్రి వివ‌రించారు.

కాగా,పాల్వంచలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్ర మంత్రి ప్రకటించడం ఫై తెరాస నాయకులు,కార్యకర్తలు  ఈరోజు సాయంత్రం పాల్వంచ స్పాంజ్ ఐరన్ వద్ద సంబురాలు జరిపి స్వీట్లు పంచారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat