Home / TELANGANA / కేసీఆర్ దీక్ష‌తోనే..డిసెంబ‌ర్ 9 చారిత్ర‌క దినం అయింది..ఎమ్మెల్యే వేముల‌

కేసీఆర్ దీక్ష‌తోనే..డిసెంబ‌ర్ 9 చారిత్ర‌క దినం అయింది..ఎమ్మెల్యే వేముల‌

కేసీఆర్ త‌న ప్రాణాల‌కు ఒడ్డి దీక్ష చేప‌ట్ట‌డంతో కాంగ్రెస్ పార్టీ భ‌య‌ప‌డి తెలంగాణ ప్రకటన ఇవ్వ‌డం వల్లనే డిసెంబర్ 9 చారిత్రకదినం అయిందని మిష‌న్ భ‌గీర‌థ వైస్ చైర్మ‌న్ వేముల ప్రశాంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. కాంగ్రెస్ నేత‌లు వాస్త‌వాలు తెలియ‌కుండా మాట్లాడుతున్నార‌ని మండిప‌డ్డారు. కాంగ్రెస్ భూస్థాపితం అవుతుంది అని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ స్వయంగా కేసీఆర్ ఇంటికి వచ్చి టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నారని గుర్తు చేశారు. తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చారు..కరీంనగర్ సభలో సోనియా కూడా తెలంగాణ ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు.

రాష్ట్రపతితో కూడా తెలంగాణ ఇస్తామని చెప్పించారని అయితే…మాట ఇచ్చి తప్పినందునా కేంద్ర కేబినెట్ నుంచి కేసీఆర్ బయటకు వచ్చారని గుర్తు చేశారు.

నవంబర్29న కేసీఆర్ అకుంఠిత దీక్ష కు దిగారని…దానికి దిగివచ్చిన కాంగ్రెస్ డిసెంబర్9న తెలంగాణ ప్రకటన చేసిందని వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. 23న మళ్ళీ వెనక్కి తగ్గిందన్నారు. ఆ తర్వాత రాజీనామా చేసి ప్రజల పక్షాన నిలిచింది టీఆర్ఎస్ పార్టీ మాత్రమేన‌ని అన్నారు. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న రేవంత్ కూడా తెలంగాణ కోసం ఏనాడు రాజీనామా చేయలేదని గుర్తు చేశారు. డిసెంబ‌ర్ 9 సంబ‌రాలు జ‌రుపుతున్న కాంగ్రెస్

డిసెంబర్23న తెలంగాణ విద్రోహా దినంగా కాంగ్రెస్ పాటిస్తుందా అని ప్ర‌శ్నించారు. రేవంత్ ను పెద్దగా చేస్తూ కాంగ్రెస్ నేతలు తమను తాము తక్కువ చేసుకుంటున్నారని ఆయ‌న ఎద్దేవా చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat