కొత్త సంవత్సరం వేడుకులకు గాను ఆయా పోలీస్ కమిషనరేట్ లు నిర్దిష్ట చర్యలుచేపడుతున్నాయి. ముఖ్యంగా ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా చూడడం కోసం పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.అవుటర్ రింగ్ రోడ్డును సాదారణ ప్రయాణికులకు మూసివేస్తున్నారు. కేవలం శంసాబాద్ విమానాశ్రయానికి వెళ్లేవారికి మాత్రమే అనుమతిస్తారు.ఈ మేరకు రాజకొండ పోలీస్ కమిషనరేట్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.అలాగే తమ పరిదిలోని అన్ని ప్లైఓవర్ లను మూసివేస్తున్నట్లు కూడా తెలిపింది.పబ్ లలో సిసిటీవీలను పక్కగా పనిచేసేలా చూడాలని, ముందుగా రిజిస్టర్ చేసుకున్న జంటలనే అనుమతించాలని, ఆడ,మగ ఎవరైనా ఒంటరిగా అనుమతించరాదని ,మద్యం సేవించినవారికి పబ్ యాజమాన్యాలు డ్రైవర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.మైనర్ లకు మద్యం సరఫరా చేయరాదని కూడా స్పష్టం చేశారు.
