ప్రముఖ సీనీ నటుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో సమావేశం అయ్యారు. బేగంపేట లోని సీఎం నివాసమైన ప్రగతి భవన్కు వచ్చి సీఎం కేసీఆర్ కు పవన్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పారు. తర్వాత సీఎంతో కలసి కాసేపు చర్చించారు.పవన్ ప్రగతి భవన్కు రావడం ఇదే తొలిసారి.అయితే వీరు ఏం మాట్లాడుకున్నారన్న దానిపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.
రాష్ట్ర విభజన సమయంలో పవన్ కల్యాణ్ ఉద్యమ నేత కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కాగా, కొత్త సంవత్సరాది సందర్భంగా ముఖ్యమంత్రికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.