Home / TELANGANA / గ‌ల్లీలో కాదు మంద‌కృష్ణ‌..ఢిల్లీలో కొట్లాడు..!

గ‌ల్లీలో కాదు మంద‌కృష్ణ‌..ఢిల్లీలో కొట్లాడు..!

మందకృష్ణ మాదిగ రిజర్వేషన్ల అంశంపై గల్లీలో కాకుండా ఢిల్లీలో ఉద్యమం చేయాలని ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవి అన్నారు. టీఆర్‌ఎస్ భవన్‌లో పిడమర్తి రవి మీడియా ద్వారా మాట్లాడుతూ.. మాదిగలకు టీఆర్‌ఎస్ పార్టీ పెద్దపీట వేస్తుందన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో టీఆర్‌ఎస్ చిత్తశుద్ధితో ఉందని తెలిపారు. మాదిగల అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌పై కొందరు అర్థంలేని విమర్శలు చేస్తున్నరని ఆయన పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్ మాదిగలకు పెద్ద పీట వేస్తున్నారని…ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ గా ఉద్యమ నాయకుడిని నియమించడం జరిగిందనే విష‌యం మంద‌కృష్ణ గ‌మ‌నించాల‌ని పిడ‌మ‌ర్తి ర‌వి అన్నారు. అంతేకాకుండా ఇద్దరు సభ్యులను నియమించార‌ని తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ , ఎస్సీ, ఎస్టీ కమిషన్లకు మాదిగలను నియమించార‌ని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మాదిగల పక్షాన నిలవడం గ‌మ‌నించాల‌ని పిడ‌మ‌ర్తి ర‌వి కోరారు.

ఢిల్లీలో చేయాల్సిన ఉద్యమం హైదరాబాద్‌లో చేస్తున్న మంద‌కృష్ణ మాదిగలకు చెడ్డ పేరు తెస్తున్నారని పిడ‌మ‌ర్తి ర‌వి అన్నారు. వర్గీకరణ పై అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రధానమంత్రి ఇవ్వడం జరిగిందని ఈ విష‌యంలో నిర్ణ‌యం తీసుకోవాల్సింది కేంద్ర ప్ర‌భుత్వ‌మేన‌ని పిడ‌మ‌ర్తి ర‌వి తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat