అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్న డిజైఎన్ కోర్సుకు మొట్టమొదటి సారిగా తెలంగాణకు చెందిన విద్యార్ధి పిండిగా రంజిత్ కుమార్ ఎంపికయ్యారు. అదికూడా ఓ దళిత కుటుంబంలో పుట్టిన విద్యార్ధి లండన్ లోని ప్రేన్నికగన్న రాయల్ కాలేజ్ అఫ్ ఆర్ట్ &డిజైఎన్ కు ఎంపిక కావడంతో అంతటి బారాన్ని మోసి నేను విద్యనూ పూర్తి చెయ్యగలనా అన్న సందేహం వెంటాడడంతో ఇక ముందుకు పోలేమోననుకున్నాడు. ఆ నోట ఈ నోట రాష్ట్ర విద్యుత్ మరియు యస్సీ అభివృద్ధి శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి చెవున పడింది . ఇక ఏముంది … అంటే సదరు విద్యార్ధి పిండిగా రంజిత్ కుమార్ దశ తిరిగింది .
ప్రతిభావంతులైన విద్యార్ధుల విదేశీ విద్యకు గాను రాష్ట్ర దళిత అభివృద్ధి శాఖా అంబేద్కర్ ఓవర్శిస్ పధకం కింద అందిస్తున్న 20లక్షల రూపాయలను మంజూరు చెయ్యడంతో సదరు విద్యార్ధి కల సాకారం కాబోతుంది. సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలం తేకుమట్ల గ్రామానికి చెందినా పిండిగా రంజిత్ కుమార్ తనకున్న అవాంతరాన్నింటిని అధిగమించి అంతర్జాతియ స్థాయి ప్రమాణాలతో కూడిన నిఫ్ట్ లో ఉన్నత విద్యను పూర్తి చేసుకున్నాడు. తనకు అత్యంత ఇస్టం అయిన డిజైఎన్ కోర్సులో ఉన్నత విద్యనూ అభ్యసించేందుకు గాను ప్రపంచంలోనే పేరొందిన వాట్లో ఒకటిగా పేరొందిన లండన్ లోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్ &డిజైఎన్ కలశాలలో సీట్ సాదించాడు . ప్రపంచం నలుమూలల నుండి ఆ కోర్సులో చేరేందుకు వందలాది మంది విద్యార్ధులు పోటి పడ్డారు … ఆ కళశాలలో ఉన్నవి మొత్తం ౩౦ సిట్లే కావడంతో పోటి అయితే పడ్డాను కాని తనకు అవకశం రాకపోవచ్చాన్న బావన్లో ఉన్న విద్యార్ధి రంజిత్ కు జాక్ పాట్ తగిలింది … అంత వరకు సిన్ బాగానే అనిపించినా లండన్ లో అటువంటి ఉన్నత్ విద్యఅందడం తనలాంటి వారికి అందని ద్రాక్షే అని మిన్నకుండి పోయారు తెల్సుకున్న మంత్రి జగదీష్ రెడ్డి తక్షణం ఉన్నతాధికారులతో సంప్రదించి,వారిని ఒప్పించి అంబేద్కర్ ఓవర్శిస్ పధకం లో భాగంగా సదరు విద్యార్ధి రంజిత్ కు 20 లక్షలు మంజూరు చేయించ గలిగాడు .