Home / TELANGANA / ఓరుగల్లు లో అపూర్వ ఘట్టం రేపే..!

ఓరుగల్లు లో అపూర్వ ఘట్టం రేపే..!

తెలంగాణ రాష్ట్ర౦లో వరంగల్ దశను, దిశను మార్చే అపురూప సందర్భం. మునుపెన్నడూలేని మధురఘట్టం. తెలంగాణ పునర్నిర్మాణంలో వరంగల్ తన పూర్వ చారిత్రక వైభవాన్ని దేదీప్యమానం చేసుకోబోయే దృశ్యం. పడావు పడ్డ పారిశ్రామిక రంగానికి కొత్త చిగుళ్లు తొడుక్కునే అజరామర కీర్తిపతాకం. తెలంగాణ సర్కార్ చిత్తశుద్ధికి, దార్శనికతకు నిలువెత్తు సాక్ష్యం. పారిశ్రామికంగా, మౌలికపరంగా వరంగల్ దేశ పటంపై సమున్నతంగా నిలబెట్టే సువర్ణావకాశం. తెలంగాణకే తలమానికంగా వరంగల్ భవిష్యత్ దర్శినికి ముఖ్యమంత్రి కేసీఆర్ అకుంఠిత దీక్షాదక్షతలతో ముందుకు సాగుతున్న నేపథ్యం. ఈనెల 22. అవిభక్త జిల్లా చరిత్రలో నిలిచిపోయే రోజు. వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాలకే కాదు..యావత్ తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చబోతున్న ముఖ్యఘట్టం ఆవిష్కృతం కాబోతున్నది అదే రోజు. ముఖ్యమంత్రి స్వహస్తాలతో రెండు ప్రతిష్టాత్మక పథకాలకు పునాది రాయి వేసి పునరంకిత స్ఫూర్తిని ప్రదర్శించనున్నారు. దేశానికే తలమానికంగా, ప్రపంచంలోనే అతిపెద్ద వస్త్ర నగరైన కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, వరంగల్ అర్బన్ జిల్లా రూపు రేఖల్ని మా ర్చే ఓఆర్‌ఆర్ నిర్మాణానికి భూమి పూజ చేయబోతున్నారు. ఈ అమృత ఘడియల కోసం వరంగ ల్ ఎదురుచూస్తోంది. వేల కోట్ల రూపాయల పె ట్టుబడి కాదు ఒకే ఒక్క వజ్ర సంకల్పం చరిత్రాత్మక దశను, దిశను మార్చబోతున్నది.

వరంగల్ రూరల్ జిల్లా గీసుగొండ, సంగెం మండలాల పరిధిలోని చింతలపల్లి, శాయంపేట గ్రామాల మధ్య కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ కు, అదే ప్రాంతంలో రూ.669.59 కోట్లతో ని ర్మించే వరంగల్ ఔటర్ రింగ్‌రోడ్ ఈ రెండు ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు మధ్యాహ్నం భూమిపూజ చేయబోతున్నారు. ఈ అపురూప సందర్భం కోసం ఉమ్మ డి వరంగల్ జిల్లా ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వరంగల్ ఇప్పటి దాకా పేరు ప్రఖ్యాతలు, చారిత్రక నేపథ్యాల కారణంగా నిలదొక్కుకుంది. ఇంతకాలం వరంగల్ పేరుచెప్పుకొని పథకాలు రూపొందించామంటే రూపొందించారే కా నీ అంతకు మించి ఒక్క అడుగు కూడా ముందు కు వేయలేని దుస్థితి. తెలంగాణ తనను తాను నవీకరించుకుంటోన్న నేపథ్యంలో తెలంగాణ ఆత్మను ఆలింగనం చేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్‌కున్న చారిత్రక, వారసత్వం కొనసాగింపుగా రెండు భారీ పథకాలకు శ్రీకారం చుట్టా రు. ఈ రెండు ప్రతిష్టాత్మక పథకాలకు పూనాది రాయి వేసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చే సందేశా న్ని కళ్లారా చూసేందుకు ఉమ్మడి జిల్లా ప్రజానీకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు ఈ సభ కు తమ తమ ప్రాంత జనంతో తరలివచ్చేందుకు కార్యాచరణ రూపొందించుకున్నారు.ఈ కార్యక్రమానికి సంబంధించిన సభ ఏర్పాట్లన్నీ చకచక జరుగుతున్నాయి .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat