కూకట్పల్లిలో టీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే కృష్ణారావు, ఎమ్మెల్సీలు నవీన్, శంభీపూర్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ”దేశంలో ఎక్కడైనా వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నారా? బీజేపీ నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో 24 గంటల విద్యుత్ ఇస్తున్నారా? గతంలో తాగడానికి నీరులేక ప్రజలు ఇబ్బంది పడేవారు. మిషన్ భగీరథతో పల్లెలు, పట్టణాల్లో నీటి బాధలు తీర్చాం. షెడ్యూల్ ప్రకారమే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతాయి. జీహెచ్ఎంసీలో గతంలో కన్నా ఎక్కువ సీట్లు సాధిస్తాం.” అని అన్నారు
