ఉత్తమ్ కుమార్ పై హుజూర్ నగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సైదిరెడ్డి మండిపడ్డారు. నీచరాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ ఉత్తమ్ కుమార్ రెడ్డే అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు హుజూర్ నగర్ అభివృద్ధి ఏనాడూ పట్టించుకోలేదని ఫైరయ్యారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ను భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత ప్రతీ కార్యకర్తపై ఉందన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సైదిరెడ్డి పాల్గొన్నారు.
