తెలంగాణ రాష్ట్రంలో గత పన్నెండు రోజులుగా సమ్మె నిర్వహిస్తోన్న ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన జీతాలను వచ్చే సోమవారం లోపు చెల్లించాలని రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం హైకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.ఆర్టీసీ కార్మికుల సెప్టెంబర్ వేతనాలు సోమవారం లోపు చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఆర్టీసీ సిబ్బందికి సెప్టెంబర్ నెల జీతాలను చెల్లింపులపై ఈ రోజు బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఆర్టీసీ యాజమాన్యం సిబ్బందికి సెప్టెంబర్ నెల జీతాలను చెల్లించలేదు అని జాతీయ టీఎంయూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో 49,190 మంది సిబ్బందికి తక్షణమే జీతాలు చెల్లించాలని ఆదేశాలను ఇవ్వాలని పిటిషనర్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
