గత ఆదివారం ఈస్టర్ సందర్భంగా జరిగిన దుర్ఘటన మర్చిపోకముందే శ్రీలంకలో శుక్రవారం మరోసారి కుల్మునాయి ప్రాంతంలో మూడు చోట్ల బాంబులు పేల్చారు.పేలుళ్లతో అలెర్ట్ ఐన సైన్యం ఆ ప్రాంతంలోని ఉగ్రవాదుల స్థావరాన్ని గుర్తించింది.సైన్యం రాకను పసిగట్టిన దుండగులు కాల్పులు ప్రారంభించారు.ఇరువర్గాల మధ్య కాసేపు కాల్పులు జరిగాయి.ఈ క్రమంలో ముగ్గురు ఆత్మాహుతి బాంబర్లు తమని తాము పేల్చుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.ఈ క్రమంలో పెద్దఎత్తున పేలుడు పదార్ధాలు,డ్రోన్లు,జెండాలను స్వాదినం చేసుకున్నారు.అయితే ఈ ఉగ్రవాదులు నేషనల్ తౌవీద్ జమాత్కు చెందిన ముష్కరులుగా అనుమానిస్తున్నారు.ఇప్పటికే శ్రీలంకలోని పలు ప్రాంతాలలో కర్ఫ్యూ విధించారు.తాజాగా పేలుళ్లలో లంక ప్రజలు మరోసారి ఉలిక్కిపడ్డారు.ఈస్టర్ నుండి ఇప్పటివరకూ వరుస పేలుళ్లతో వందల మంది చనిపోయారు.