టీఆర్టీ(టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్) నోటిఫికేషన్కు లైన్ క్లియర్ అయింది. టీఆర్టీ నోటిఫికేషన్పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. పాత జిల్లాల ప్రాతిపదికన నోటిఫికేషన్ ఇవ్వాలన్న పిటిషన్కు హైకోర్టు కొట్టేసింది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొనే నోటిఫికేషన్ ఇచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కొత్త జిల్లాల వారీగా కాకుండా పాత జిల్లాల వారీగా నోటిఫికేషన్ వేయాలని గతంలో పిటిషన్ దాఖలు అయిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ప్రభుత్వ వాదనతో హైకోర్టు ఏకీభవించింది.
