ఇటీవలే గ్రేటర్ వరంగల్ 44వ డివిజన్ కార్పోరేటర్ అనిశెట్టి మురళి హత్యకు గురైన నేపద్యంలో దానికి గాను ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువరించిన సందర్బంగా ఈ రోజు వరంగల్ అర్బన్ పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్దిని ప్రకటించింది.అనిశెట్టి మురళి భార్య అనిశెట్టి సరితని టీఆర్ఎస్ అభ్యర్దిగా ప్రకటించారు.ఈ సందర్బంగా మేయర్ నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ.. ప్రజాక్షేత్రంలో గెలిచి ప్రజలకోసం పనిచేసి హత్యకు గురైన మా కార్పోరేటర్ అనిశెట్టి మురళి కుటుంబానికి అండగా నిలవాల్సిన బాద్యత మనపై ఉందని,హత్య జరిగిన నాడు అన్ని పార్టీలు ముక్త కంఠంతో ఖండించాయని,ఆ కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారని ,ఇప్పుడు ఈ ఎన్నికలో మురళి గారి భార్య సరిత ఎన్నికను ఏకగ్రీవం చేసి ఆ కుటుంబానికి అండగా నిలుద్దామని,రాజకీయాలు పక్కన పెట్టి ఏకగ్రీవం దిశగా అన్ని పార్టీలు సహకరించాలని మేయర్ నరేందర్ కోరారు.తన భర్త అనిశెట్టి మురళి తనతో లేకున్నా మురళి ఆశయాలను నెరవేర్చేందుకు సరిత గారికి అవకాశం ఇద్దామని,అన్ని పార్టీల పెద్దలను తాము స్వయంగా కలిసి అభ్యర్దిస్తామని మేయర్ నరేందర్ తెలిపారు.హత్యా రాజకీయాలను వ్యతిరేకించేవారు ఎన్నిక అనివార్యమైన పక్షంలో సరిత గారిని అఖండ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాద్యత మనపై ఉందని ఆ దిశగా శ్రేణులు పనిచేయాలని మేయర్ సూచించారు.