తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో కెరీమేరీ, బజార్ హత్నుర్, జైనూర్, నార్నూర్, మండలాల్లో రైతులు ఆపిల్ సాగుపట్ల ఆసక్తి చూపుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా లోని వాతావరణ పరిస్థితులు ఆపిల్ సాగుకు అనుకూలంగా ఉన్నాయని తేలింది. ముఖ్యంగా కెరీమేరీ మండలంలోని పరిస్థితులు ఆపిల్ సాగుకు అత్యంత అనుకూలంగా ఉన్నాయని, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని పోలి ఉన్నాయని, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో కంటే అనువుగా ఉన్నాయని సెంట్రల్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యూర్ బయాలజీ శాస్త్రవేత్తలు తెలిపారు.
భవిష్యత్తులో ఎండలను తట్టుకోవడానికి ఆపిల్ సాగు చేస్తున్న తోటల్లో పూర్తిగా పచ్చదనంతో ఉండి అతితక్కువ ఉష్ణోగ్రతలు ఉండేలా రైతులు జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికే నాటిన మొక్కలు ఆరోగ్యంగా ఎదగడం రైతులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి.
అంతా అనుకున్నట్లు జరిగితే, 2019లో మనకు కశ్మీర్ ఆపిల్ స్థానంలో మనకు మన తెలంగాణ రాష్ట్రంలో పండించిన “కొమరం భీమ్”, “నాగోబా” ఆపిల్స్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇది మన తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణంగా చెప్పుకోవచ్చు. బంగారు తెలంగాణ నిర్మాణంలో ఎవరి పాత్రల్లో వారు బిజీగా ఉన్నారు అని చెప్పడానికి ఆదిలాబాద్ రైతుల కృషిని ఒక చక్కని ఉదాహరణ.
by – సత్యప్రసాద్ పెద్దపెల్లి