తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడా.. అని ఎదురుచూస్తున్న మెట్రో కల సాకారమైంది. డిసెంబర్ 28రోజున రాష్ట్ర రాజధానిలోని మియాపూర్ మెట్రో స్టేషన్ వేదికగా మధ్యాహ్నం 2.30 గంటలకు.. హైదరాబాద్ మెట్రో రైలును ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కలిసి మెట్రో రైలును ప్రారంబించారు.దేశంలోనే ఎ మెట్రో రైలుకి లేనన్ని వసతులతో మన హైదరాబాద్ మెట్రో రైలు అందుబాటులోని వచ్చినది .
ప్రసుత్తానికి హైదరాబాద్ మెట్రో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రైళ్లను నడుపుతున్నారు.అయితే ప్రతిపాదన నుంచి ప్రారంభం వరకు అనేక అంశాల్లో చరిత్ర సృష్టిస్తున్న హైదరాబాద్ మెట్రోరైలు.. తొలిరోజే మరో రికార్డు సృష్టించింది. దేశంలోని మిగతా మెట్రోలతో పోల్చితే మొదటిరోజే దాదాపు లక్ష మంది ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చి ఆల్ టైం రికార్డు సృష్టించింది.
మొదటి దశ ఆపరేషన్స్లో భాగంగా 30 కిలోమీటర్ల ప్రయాణం ( నాగోల్-మియాపూర్ ) రూట్లో మెట్రో అందుబాటులోకి వచ్చింది.దీని ద్వారా నాగోల్ నుండి మియాపూర్ రూట్లో ట్రాఫిక్ సమస్య చాలా తగ్గింది.సామాన్య జనాలకు అందుబాటులోకి వచ్చిన మెట్రో రైలు కానీస టికెట్ ధర రూ. 10, గరిష్ఠ టికెట్ ధరను రూ. 60 గా నిర్ణయించారు.టీ – సవారీ పేరుతో రూపొందించిన మెట్రో స్మార్ట్కార్డ్ను కూడా అందుబాటులోకి తీసుకోచ్చారు.