వేములవాడ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం…ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. వేములవాడ అభివృద్ధిపై శనివారం స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్బాబు మంత్రి కేటీఆర్తో హైదరాబాద్లో భేటీ అయ్యారు. వేములవాడ దేవస్థాన అభివృద్ధి ప్రణాళిక, పట్టణాభివృద్ధి, నిరంతరం తాగునీరు, సాగునీరు ప్రాజెక్టులు, రహదారులు, విద్య, వైద్యం, ముంపు గ్రామాలకు ఉపాధి తదితర అంశాలపై చర్చించారు.
అంగరంగ వైభవంగా శివరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు రూ.50లక్షల నిధులు మంజూరుకు ఆదేశాలి చ్చినట్లు ఎమ్మెల్యే చెన్నమనేని పేర్కొన్నారు. వేములవాడ సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం సంపూర్ణ మద్దతునిస్తుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వేములవాడ అభివృద్ధికి కృషి చేస్తానన్న మంత్రి కేటీఆర్కు ఎమ్మెల్యే చెన్నమనేని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.