Home / TELANGANA / ఎండా కాలంలో నీటి కష్టాలు ఉండవు..మంత్రి పద్మారావు

ఎండా కాలంలో నీటి కష్టాలు ఉండవు..మంత్రి పద్మారావు

తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ నియోజకవర్గంలో మంచి నీటి కష్టాలు శాశ్వతంగా తొలగనున్నాయి. ఇప్పటికే రిజర్వయర్ల నిర్మాణం, మంచి నీటి పైప్ లైన్ల మార్పిడి, కృష్ణా జలాల మళ్లింపు, రికార్డు సంఖ్యలో పవర్ బోరింగ్ల ఏర్పాటు వంటి విప్లవాత్మక మార్పుల ద్వారా సికింద్రాబాద్ ప్రజల నీటి ఇబ్బందుల నివారణకు పక్కా ఏర్పాట్లు జరిపిన ఆబ్కరి, క్రీడల మంత్రి టీ.పద్మారావు గౌడ్ తాజాగా జల మండలి అధికారులతో సంప్రదింపులు జరిపి రూ.1.22 కోట్ల మేరకు నిధులను మంజూరు చేయించారు.

see also : అవినీతి చేసుకోమని చంద్రబాబు నాయుడు చెప్పడనే వీడియో హల్ చల్

see also : నాగం జనార్ధన్ రెడ్డికి దిమ్మతిరిగే షాక్ ..

మంత్రి పద్మారావు సూచన మేరకు ఈ నిధుల వినియోగానికి జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్ తాజాగా అనుమతిని మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారి చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని అడ్డగుట్ట, మెట్టుగూడ, తార్నాక, బౌధనగర్, సీతాఫల్ మండి డివిజన్ లలో ని 17 ప్రాంతాలలో మంచి నీటి సరఫరా మెరుగుదలకు ఉపకరించే పైప్ లైన్ల మార్పిడి, సివర్ లైన్ల మార్పిడికి ఈ నిధులను వినియోగిస్తారు. ఒక్కో డివిజన్ పరిధిలో సుమారుగా రూ. 25 లక్షల మేరకు నిధులను వినియోగిస్తున్నట్లు, స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా వ్యవస్థాపరమైన అభివృధిని చేపదుతున్నామని మంత్రి పద్మారావు గౌడ్ వివరించారు. తాజాగా మంజురైన నిధులతో పనులను వెంటనే ప్రారంభించాలని ఆయన జలమండలి జనరల్ మేనేజర్ సుదర్శన్ ను ఆదేశించారు.

see also : సుప్రీం హీరో ప‌త‌నం క‌న్ఫాం..! ఫిక్స్ చేసిన పెద్ద‌న్న‌..!!

see also : వైసీపీలోకి ఫిరాయింపు ఎంపీ ..జగన్ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిటింగ్ ..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat