భారత స్టార్ షట్లర్ సైనా, కారుపల్లి కషబ్ డేటింగ్లో ఉన్నారంటూ ఇటీవల సోషల్ మీడియా కోడై కూసిన విషయం తెలిసిందే. అయితే ఆ డేటింగ్ రూమర్లను పెళ్లితో నిజం చేయమని అభిమానులు కోరుతున్నారు. ఇంతకీ అసలేం జరిగిందంటే..! హైదరాబాద్ నగర పరిధిలోగల ఓ రెస్టారెంట్లో ఇటీవల కషబ్ తో కలిసి దిగిన ఫోటోను సైనా నెహ్వాల్ తన ఇన్స్ట్రాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోను చూసిన అభిమానులంతా విపరీతంగా షేర్లు చేశారు.
దీంతో ఒక్కసారిగా వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందంటూ.. కొందరు కామెంట్లు చేయగా.. మరికొందరేమో వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ రూమర్లు సృష్టించారు. మరికొందరైతే ఒక అడుగు ముందుకేసి పై కామెంట్లను పెళ్లి చేసుకుని నిజం చేయండి అంటూ కామెంట్లు పెట్టారు.