తొలి విడుత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. బ్యాలెట్ విధానంలో ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కు అధికారులు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశారు.ఫలితాల విడుదల తర్వాత ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామాల్లో బలమైన భద్రత ఏర్పాటు చేశారు.
భోజనం తరువాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు తరువాత ఫలితాలను వెల్లడిస్తారు. ఆ తరువాత వార్డు సభ్యుల నుండి ఒకరిని ఉప సర్పంచిగా ఎన్నకుంటారు.అభ్యర్థులు,ఓటర్లు ఎవరైనా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే ఎన్నికల నిబంధనలు ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల పరిశీలకులు చెబుతున్నారు.