టీఆర్ఎస్ పార్టీ నూతన మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సబితా ఇంద్రారెడ్డి ఒక అరుదైన రికార్డు సాధించింది. అదేమిటంటే నలుగురు ముఖ్యమంత్రులు దగ్గర మంత్రిగా పనిచేసిన రికార్డు ఆమెదే. ఈమె భర్త ఇంద్రారెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. భర్త మరణం తరువాత ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. 2004 లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయంలో మంత్రి అయ్యారు. అనంతరం 2009 ఎన్నికల్లో మరోసారి గెలిచిన సబితా ఈసారి హోంమంత్రి భాధ్యతలు చేపట్టారు. దాంతో దేశంలోనే మొట్టమొదటి మహిళా హోంమంత్రిగా రికార్డు సృష్టించారు. వైఎస్ఆర్ మరణం తరువాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ లో మంత్రిగా కొనసాగారు. ఇక గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచింది.అయినప్పటికీ పార్టీ విలీనం కావడంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అవ్వడమే కాకుండా కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రి అయ్యి మరో రికార్డు పొందారు.
