పర్యావరణానికి అతి పెద్ద ప్రమాదకారి ప్లాస్టిక్ అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అటువంటి ప్రమాదకరమైన ప్లాస్టిక్ ను వదిలేసి భూతల్లిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
శనివారం సాయంత్రం పట్టణ ప్రగతిలో బాగంగా సూర్యపేట పట్టణంలోని బ్రాహ్మణ కళ్యాణమండపం లో సుధాకర్ పి విసి మరియు ఐ సి ఐ సి ఐ బ్యాంక్ ల ఆధ్వర్యంలో చేపట్టిన ఏడూ వేల జనుప నార సంచిలను ఆయన చేతుల మీదుగా పంపిణీ గావించారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల్లో చైతన్యం రానంత వరకు ఏ కార్యక్రమం చేపట్టినా సత్ఫాలితలు రావని ఆయన అభిప్రాయపడ్డారు. అటువంటి చైతన్యాన్ని ప్లాస్టిక్ అంశంపై కలిగించేందుకు ప్రతిఒక్కరు సన్నద్ధం కావాలని ఆయన ఉద్బోధించారు. ఏ రూపం లో వాడినా ప్లాస్టిక్ మానవాళి మనుగడకు ముప్పు తెస్తుందన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం పనిచేయాల్సిన ఆవశ్యకత ను ఆయన వివరించారు.
ఒక్క సూర్యపేట కో తెలంగాణా రాష్ట్రానికో ఈ సమస్య తలెత్తలేదని యావత్ ప్రపంచానికి సవాల్ విసురుతున్న పర్యావరణ సమస్యకు ప్లాస్టిక్ మూల కారణమన్నది ప్రతిఒక్కరూ గుర్తించాలని మంత్రి జగదీష్ రెడ్డి కోరారు. అటువంటి ప్లాస్టిక్ ఇప్పుడు భూతల్లిని కబళించే దిశగా మారిందని ఆయన ఆందోళన వెలిబుచ్చారు. అత్యాశతో మానవుడు సృష్టించిందే ప్లాస్టిక్ అని అటువంటి ప్లాస్టిక్ ఇప్పుడు క్యాన్సర్ వంటి వ్యాధులతో ప్రాణాంతకంగా మారిందన్నారు.అటువంటి ప్లాస్టిక్ నిర్ములనకు గాని పర్యావరణ పరిరక్షణకు గాని గత పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.అటువంటి ప్లాస్టిక్ ను సమూలంగా రద్దు చేసి ప్లాస్టిక్ రహిత సమాజం తో పాటు మొక్కల పెంపకం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. అందులో భాగమే హరితహారం కార్యక్రమమని ఆయన తెలిపారు. అటువంటి పర్యావరణ పరిరక్షణ లో భాగస్వామ్యం అయి ముందుకు వచ్చిన సుధాకర్ పి విసి మరియు ఐ సి ఐ సి ఐ బ్యాంక్ లను మంత్రి జగదీష్ రెడ్డి అభినందించారు.ఇదే స్ఫూర్తితో సూర్యపేట పట్టణాన్ని గ్రీన్ సిటీగా రూపాంతరం చెందడానికి పట్టణ ప్రజలు భాగస్వామ్యం కావాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు.