తెలంగాణ బడ్జెట్ సమావేశాలు శనివారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమయ్యాయి. ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్రావు 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలను శాసనసభలో ప్రవేశపెట్టారు. అన్ని వర్గాల సంక్షేమం, అన్ని రంగాల అభివృద్దే లక్ష్యంగా వాస్తవిక కోణంలో బడ్జెట్ రూపొందించినట్టు హరీష్ తెలిపారు. బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉందని అన్నారు. ‘బడ్జెట్ అంటే కాగితాల లెక్కలు కాదు.. సామాజిక స్వరూపం’అని మంత్రి వ్యాఖ్యానించారు. ఆర్థిక మంత్రి హోదాలో హరీష్రావు తొలిసారి శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెడుతుండగా.. మండలిలో శాసనసభా వ్యవహా రాల మంత్రి ప్రశాంత్రెడ్డి బడ్జెట్ ప్రవేశపెడతారు.
తెలంగాణ వార్షిక బడ్జెట్ – 2020-21
-వాస్తవిక దృక్పథంతో 2020-21 బడ్జెట్ రూపకల్పన.
-బడ్జెట్ అంటే కేవలం కాగితాల మీద రాసే అంకెలు కాదు.
-కేంద్రం నుంచి రాష్ట్రానికికి రావాల్సిన పన్నుల వాటా తగ్గింది.
-దేశంలో తెలంగాణ ప్రభుత్వం నూతన అధ్యాయాన్ని సృష్టించింది.
-కేసీఆర్ సారథ్యంలో ప్రగతిశీల రాష్ర్టంగా ముందుకెళ్తుంది.
తెలంగాణ వార్షిక బడ్జెట్ – 2020-21
2020-21 ఆర్థిక సంవత్సరానికి మొత్తం బడ్జెట్ – రూ. 1,82,914.42 కోట్లు
-రైతుబంధు పథకం కోసం రూ. 14 వేల కోట్లు
-రైతు బీమా కోసం రూ. 1,141 కోట్లు
-విత్తనాల సబ్సిడీకి రూ. 142 కోట్లు..
-పాడి రైతుల ప్రోత్సాహం కోసం రూ. 100 కోట్లు
-రైతు వేదికల నిర్మాణం కోసం రూ. 350 కోట్లు
-ఒక్కో రైతు వేదికకు రూ. 12 లక్షలు కేటాయింపు
-బిందు, తుంపర సేద్యానికి రూ. 600 కోట్లు