మిర్యాలగూడ మారుతీరావు ఆత్మహత్య తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన విషయం అందరికి తెలిసిందే. ఈయనకు సుమారు 200కోట్లు ఆస్థి ఉందని తేలింది. ఎన్ని కోట్లు ఉంటే ప్రయోజనం ఏముంది. కన్న కూతురుకి దూరమయిపోయి చివరికి ఒక ముద్దాయిగా సమాజంలో ముద్ర వేయించుకున్నాడు. కిరోసిన్ అమ్మకంతో మొదలుపెట్టిన తన వ్యాపారం ఇప్పుడు ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఎన్నో రకరకాల వ్యాపారాలు చేసి మంచి స్థాయికి వచ్చాడు. బిల్డర్ గా మారి రియల్ ఎస్టేట్ ప్రారంభించాడు. ఈదులగూడలో రెండంతస్తుల షాపింగ్ మాల్స్ ఉన్నట్లు తెలుస్తుంది. మరోపక్క మిర్యాలగూడ బస్టాండ్కు దగ్గరలో అతి పెద్ద మల్టీప్లెక్స్ నిర్మాణంలో ఉండగా అక్కడే ఆయన కార్యాలయం కూడా ఉండేదట. ఇలా ఎన్నో వెంచర్స్, వ్యవసాయ భూములు అన్నీ కలిపి 200 కోట్ల వరకు ఉన్నట్టు తెలుస్తుంది. ఇందులో కొన్ని భినామీల పేరిట ఉండడంతో వారు సర్దుకుంటున్నారని అనుకుంటున్నారు.