తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెల్సిందే. నేడో రేపో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయం అంటున్నారు రాజకీయ నిపుణులు.
తాజాగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ మారుతారనే ఊహాగానాలు పెరిగాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చినప్పటికీ ఎంపీ వెంకట్ రెడ్డి తగ్గలేదు. తామిద్దరం బాగానే ఉన్నామని, వివాదాలు లేవని రేవంత్ చెప్పినప్పటికీ.. రేవంత్ ముఖం చూడనని తేల్చి చెప్పారు.
మునుగోడులో నేడు కాంగ్రెస్ సమావేశానికి కూడా రానని చెప్పేశారు. కాసేపట్లో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాను కలవనున్నారు. మరి కోమటిరెడ్డి పార్టీ మార్పుపై మీ కామెంట్ ఏంటి?