సహజంగా శృంగారం అంటే మగవాళ్లకు ఎక్కువ కోరికలు ఉంటాయి. వాళ్ళే పెద్ద రసికులు అని అందరూ అంటారు. కానీ ఎవరు రసికులు.. ఎవరికి ఎక్కువగా ఆ కోరికలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాము.. అయితే మన దేశంలో సహజంగా మగవాళ్లకే ఎక్కువగా అక్రమ సంబంధాలుంటాయని భావన అందరిలో ఉంది. అయితే ఒక తాజా సర్వేలో మగవాళ్ల కంటే ఆడవాళ్లకే ఎక్కువగా ఆ సంబంధాలుంటాయని తేలింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే పేరుతో ఒక వార్త మీడియాలో వైరల్ అవుతుంది. ఆ సర్వేలో ఏమి తేలిందంటే దేశంలోని పదకొండు రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల్లో పురుషుల కంటే స్త్రీలకే ఎక్కువ శృంగార భాగస్వాములను కలిగి ఉంటారని తేలింది.
ఈ జాబితాలో రాజస్థాన్ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలవగా ఈ రాష్ట్రంలో ఒక్కొ మహిళ సగటున 3.1మందితో పురుషుల శృంగార భాగస్వామ్యం కల్గి ఉన్నట్లు తేల్చి చెప్పింది. అయితే పురుషుల సగటు మాత్రం కేవలం 1.8 మాత్రమే. ఏపీ,తెలంగాణలో మాత్రం మగవాళ్లకే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. రాజస్థాన్ ,హరియాణ,చండీగడ్ ,జమ్ముకాశ్మీర్ ,లద్దాక్ ,మధ్యప్రదేశ్ ,అసోం,కేరళ,లక్షద్వీప్,పుదుచ్చేరి,తమిళనాడులోని మహిళలకు పురుషులతో పోలిస్తే ఎక్కువమంది శృంగార భాగస్వాములున్నట్లు తేలింది.
2019-21మధ్య కాలంలో ఆ సంస్థ దేశ వ్యాప్తంగా 28రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల్లోని 707 జిల్లాలో ఈ సర్వే నిర్వహించింది. ఇందులో 1.10లక్షల మంది స్త్రీలు,లక్ష మంది పురుషులను సర్వేలోకి తీసుకుని గత పన్నెండు నెలల్లో ఎవరెవరు తమ తమ భాగస్వామితో కాకుండా వేరోకరితో శృంగారంలో పాల్గొన్నారు. ఎంతమందితో ఎన్ని సార్లు పాల్గొన్నారు.. జీవిత కాలంలో ఎంతమందితో పాల్గొన్నారు తదితర అంశాలపై సర్వే నిర్వహించినట్లు ఆ కథనం సారాంశం ..ఈ సర్వేకు ముందు ఒక ఏడాది కాలంలో తమ భాగస్వామితో మాత్రమే శృంగారంలో పాల్గొన్నామని చెప్పిన మగవారు 4% ఉంటే మహిళలలో ఈ సంఖ్య 0.5% ఉండటం గమనార్హం .