మునుగోడు ఉప ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయమని కోదాడ టీఆర్ఎస్ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు .మంగళవారం మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ మండలంలోని తూప్రాన్ పేట, కైతాపురం ఎల్లగిరి, గ్రామాలలో మిత్ర పక్షాలు బలపరిచిన మునుగోడు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ఆశీర్వదించండి మునుగోడు నియోజకవర్గని అభివృద్ధి చేస్తాడని ఆయన అన్నారు. కూసుకుంట్ల గెలుపు.. మునుగోడు అభివృద్ధికి మలుపుని ఆయన అన్నారు.రాజగోపాల్ రెడ్డిపై నమ్మకంతో ఈ ప్రాంత ప్రజలు MLA గా గెలిపిస్తే మూడున్నర సంవత్సరాలలో కనీసం గ్రామాల వైపు కన్నెత్తి కూడా చూడలేదని, ప్రజల సమస్యలను పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. రాజగోపాల్ రెడ్డి 18 వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కు అమ్ముడుపోయి పార్టీ మారిన కారణంగా ఉప ఎన్నికలు వచ్చాయని, దీని వలన ప్రజలకు ఎలాంటి మేలు జరగదన్నారు. నియోజకవర్గ అభివృద్ధి జరగాలన్న, ప్రజల సమస్యల పరిష్కారం కావాలన్న అది ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం తోనే సాధ్యం అవుతుందన్నారు.
టిఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. నియోజకవర్గ ప్రజలకు ఏం చేశారో చెప్పకుండా BJP నేతలు అదే పనిగా ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వాని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని, ప్రజలు అంటా గమనిస్తున్నారని, ఎన్నికలలో తగిన గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు.వచ్చే నెల 3న జరిగే మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా.. ఈరోజు జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా విచ్చేసిన మిత్ర పక్షాలు బలపర్చిన టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, మునుగోడు నియోజకవర్గ ఇంచార్జి కూసుకుంట్ల ప్రభాకర్ గారికి ఆయా గ్రామాల ప్రజలు, వేలాదిమంది మహిళలు అంతా బతుకమ్మలు, బోనాలతో కోలాటాలు,డప్పు, వాయిద్యాలతో బాణసంచా కలుస్తూ ,ఆట పాటలతో ఘన స్వాగతం పలికారు.