Home / SLIDER / కూసుకుంట్లను భారీ మెజార్టీతో గెలిపించాలి

కూసుకుంట్లను భారీ మెజార్టీతో గెలిపించాలి

మునుగోడు ఉపఎన్నికల్లో భాగంగా చౌటుప్పల్‌ మండలంలోని కాట్రేవు, ఆరేగూడెం గ్రామాల్లో మంత్రి మల్లారెడ్డి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డితో కలిసి మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాలుగేండ్ల కష్టాన్ని తీర్చుకునే అవకాశం మునుగోడు ప్రజలకు వచ్చిందని, దానిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాన్నారు.

గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ప్రజల మధ్యే ఉన్న కూసుకుంట్లను భారీ మెజార్టీతో గెలిపించాలన్ని కోరారు.ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి రాజీనామా చేసి ముగ్గురు ఎమ్మెల్యేలున్న పార్టీలో చేరిన రాజగోపాల్ రెడ్డి ఏం అభివృద్ధి చేస్తాడని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రశ్నించారు. కోమటిరెడ్డి అసలు ఎందుకు రాజీనామా చేశాడో.. ఓటు వేసే ముందు ఒక్కసారి ప్రజలు ఆలోచించాలన్నారు. పక్కనే ఉన్న కర్ణాటకలో ఉన్న బీజేపీ అధికారంలో ఉన్నదని, అక్కడ రూ.2016 పింఛన్లు లేవని, గొర్రెల కాపరులకు సాయం లేదని, కల్లు గీత కార్మికులను అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.

దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల తర్వాత ఆ నియోజకవర్గాలకు కేంద్ర ప్రభుత్వం కనీసం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పారు. నియోజకవర్గంలో సబ్బండ వర్గాలు కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాయని చెప్పారు. దేశంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న తెలంగాణకు ప్రజలంతా అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని శ్రీనివాస్‌ గౌడ్‌ చెప్పారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat