ఏపీ తెలంగాణతో పాటు యావత్ దేశ రాజకీయాల్లోనే సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫాంహౌజ్లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బొమ్మరబెట్టు లక్ష్మీ జనార్దన్ సంతోష్ (బీఎల్ సంతో్ష)ను తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు అరెస్ట్ చేయరాదని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు హైకోర్టు నిర్దేశించింది.
సంతోష్ కూడా సీఆర్పీసీ 41ఏ నిబంధనలను పాటించాలని, సిట్ ఎదుట హాజరై దర్యాప్తునకు సహకరించాలని ఆదేశించింది. ఈనెల 21న తమ ఎదుట హాజరు కావాలంటూ సంతో్షకు సిట్ జారీ చేసిన నోటీసుపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది.
సదరు నోటీసును సంతో్షకు అందజేయాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్కు నిర్దేశించింది. తదుపరి విచారణను ఈనెల 22కు వాయిదా వేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ఈనెల 21న తమ ఎదుట హాజరు కావాలని, సిట్ కార్యాలయమైన బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్కు రావాలని సంతో్షకు సిట్ సీఆర్పీసీ 41ఏ కింద నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే.