ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ ఇలపావులూరి మురళీ మోహన్ రావు మృతిపట్ల తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం తెలిపారు. పత్రికా రంగానికి ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు.
ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు సద్గతులు చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకున్నారు.ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన మురళీ మోహన్ రావు.. 40-50 ఏళ్ల క్రితమే హైదరాబాద్ స్థిరపడ్డారు.
ఆదివారం సెలవు కావడంతో తన కుటుంబంతో స్వస్థలమైన అద్దంకి వెళ్లారు. ఈ క్రమంలోనే అర్ధరాత్రి గుండెపోటు రావడంతో ఆయన కుటుంబసభ్యులు హుటాహుటిన ఒంగోల్లోని దవాఖానకు తరలించారు. అయితే అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారని ఆయన కుమారుడు ప్రమోద్ తెలిపారు.