తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్లో ఉన్న బస్తీదవాఖానల మాదిరిగానే రాష్ట్రవ్యాప్తంగా 2 వేల పల్లె దవాఖానలు ఏర్పాటుచేస్తామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. వీటిని ఈ నెలలోనే ప్రారంభిస్తామని చెప్పారు. ప్రస్తుత ఏఎన్ఎం సెంటర్లను పల్లెదవాఖానలుగా అప్గ్రేడ్ చేస్తామని వివరించారు.
నిన్న ఆదివారం ఆయన హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్లో నిర్వహించిన ఏఎన్ఎంల 2వ మహాసభల్లో ముఖ్య అతిథిగా మాట్లాడారు. కరోనా సమయంలో ఏఎన్ఎంలు చేసిన సేవలు అమూల్యమని ప్రశంసించారు.
ప్రాథమిక వైద్యం అందించి, రోగాలు ముదరకుండా కాపాడటంలో ఏఎన్ఎంలది కీలక పాత్ర అని చెప్పారు. హైదరాబాద్లో బస్తీ దవాఖానలు సూపర్హిట్ అయ్యాయనివివరించారు. అన్ని జిల్లాల్లో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.